SUCCESSFUL RESCUE OPERATION AT SIRCILLA MANERU

మానేరు వాగు ప్రవాహం లో గొర్ల కాపరి చంద్రమౌళి గారు చిక్కుకున్న విషయం తెలియగానే గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి దృష్టికి గౌర పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణిగారు తీసుకెళ్లి జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేశారు..
ఈ ప్రవాహంలో చిక్కుకున్న గొర్ల కాపరి చంద్రమౌళి గారిని కాపాడడానికి తీసుకున్న సహాయ చర్యలను గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు , RDO శ్రీనివాస్ రావు గారు, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ గారు, తెరాస పార్టీ జిల్లా కన్వీనర్ తోట ఆగయ్య గారు, తెరాస పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి గారు దగ్గరుండి పర్యవేక్షించారు …
గొర్ల కాపరి చంద్రమౌళి గారిని సురక్షిత ప్రాంతానికి తీసుకు వచ్చిన తర్వాత పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు చంద్రమౌళి గారి తో మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చరు…
ప్రమాదంలో చిక్కుకున్న గొర్రెలను కూడా ఒడ్డుకు తీసుకువచ్చే ఏర్పాట్లను చేయిస్తామన్నారు…
ఈ సహాయక చర్యల్లో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, అగ్నిమాపక, పర్యాటక శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు…